హైదరాబాద్ హోటల్ లో దెయ్యం కలకలం



వాస్తవం సంగతి పక్కనపెట్టి ప్రస్తుతం హైదరాబాద్ లో వెలుగుచూసిన ఓ ఘటన ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఓ హోటల్ లో దెయ్యం అందులో బస చేసిన వారిపై దాడి చేసిందన్న వార్త ఒక్కసారిగా గుప్పుమంది. ఆ దెబ్బకు స్థానికులు మొత్తం రాత్రంతా రోడ్లపైనే గడపటం విశేషం.

వివరాళ్లోకి వెళ్లితే… మహారాష్ట్ర నుంచి డాక్టర్ సయ్యద్ కుటుంబం హైదరాబాద్ చూసేందుకు వచ్చింది. పాతబస్తీలోని కోజీ లాడ్జ్ లో వీరు బస చేశారు. మూడు రూమ్ లు తీసుకున్నారు. రెండు రూమ్ లలో కుటుంబ సభ్యులు పడుకోగా, మూడో రూమ్ లో డాక్టర్ సయ్యద్ తన తండ్రితో పాటు పడుకున్నాడు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో… ఒక్కసారిగా అరుపులు, కేకలు వినిపించాయి. అరుపులు విని పక్క గదుల్లో ఉన్న వారంతా బయటకు వచ్చారు. జరిగిన విషయం విని లాడ్జ్ నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు లాడ్జ్ కు చేరుకుని, ఏం జరిగిందని డాక్టర్ ను ప్రశ్నించారు.

No comments

Powered by Blogger.