బాబోయ్ కామకలాపాలకి నిలయంగా మారిన మన ప్రముఖ పుణ్య క్షేత్రం...



శివనామ స్మరణతో ఆధ్యాత్మికత వెళ్లి విరియాల్సిన చోట అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయి. శైవక్షేత్రమైన శ్రీకాళహస్తిలో కొంత మంది అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ పుణ్య క్షేత్ర ప్రతిష్టని దిగజారుస్తున్నారు.
బయటి ప్రాంతాలనుంచి వివాహేతర సంబంధాలతో వచ్చి ఇక్కడ ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు కాళహస్తిలో తరచూ జరుగుతున్నాయి. కొంత మంది వ్యక్తులు సుదూర ప్రాంతాలనుంచి యువతులను రప్పించి లాడ్జీలలో వారిచే అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న ఘటనలు లు చాలానే పోలీస్ లు బయట పెట్టారు.

సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్య లో వస్తుండడంతో లాడ్జీల సంఖ్య కూడా పట్టణం లో పెరిగింది.లాడ్జికి ఎవరు వచ్చినా వారి వివరాలను యాజమాన్యాలు నమోదు చేయవలసి ఉంది. కానీ వారు డబ్బు కు ఆశపడి లాడ్జి యాజమాన్యాలే అసాంఘిక కార్యక్రమాలను ప్రోత్సాహిస్తున్నారు.
మరో వైపు తిరుపతి లో కూడా ఇలాంటి కార్యకలాపాలు అధికంగానే జరుగుతున్నాయి.తిరుపతి అర్బన్ ఎస్పీ జయలక్ష్మి మాట్లాడుతూ తనిఖీలను ముమ్మరం చేస్తున్నామని అద్దె కోసం వచ్చే వారి వద్ద విధిగా గుర్తింపు కార్డు, వివరాలను సేకరించాలని ఆమె అన్నారు.

No comments

Powered by Blogger.